చెన్నై, మార్చి 8: తమిళనాడులో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తం 13 మంది కీలక నేతలు ఆ పార్టీని వీడారు. బుధవారం వారు బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేలో చేరారు. వీరంతా చెన్నై పశ్చిమ ప్రాంతానికి చెందిన బీజేపీ ఐటీ విభాగం నేతలు. ఇటీవల పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం.