సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, దానికి ఆనుకుని ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో రెండు రోజులుగా తేలికపాటి వాన జల్లు కురుస్తోంది. బుధవారం రాత్రి 10గంటల వరకు గచ్చిబౌలిలో అత్యధికంగా 2.సెం.మీలు, రహ్మత్నగర్లో 1.63సెం.మీలు, బోరబండలో 1.50సెం.మీలు, అమీర్పేటలో 1.38సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా, నగరంలో కురిసిన వర్షానికి పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గంటల తరబడి రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.