తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులు ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్ తాజాగా వెల్లడించిన అంశాలు ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దౌత్య మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ విషయం సీఎం కార్యాలయానికి తెలుసునని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం సీఎంవో దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం బెయిల్పై ఉన్న స్వప్న సురేశ్ తాజాగా పలు చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కార్యకలాపాల గురించి సీఎం కార్యదర్శికి తెలుసునని వెల్లడించారు.