Today History: గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో మారణకాండ జరిగి ఇవాల్టికి సరిగ్గా 20 ఏండ్లు పూర్తయ్యాయి. 2002 ఫిబ్రవరి నెలలో ఇదే రోజున గోద్రా రైల్వే స్టేషన్లో నిలిచిన సాబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ఎస్-6 బోగీకి దుండగులు నిప్పంటిండచంతో దాదాపు 59 మంది సజీవదహనమయ్యారు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో వేయికి పైగా మరణించారు. ఈ ఘటన జరిగిన 19 ఏండ్ల తర్వాత కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన రఫిక్ బతుక్ను గోద్రాలోనే పోలీసులు పట్టుకున్నారు.
గోద్రా స్టేషన్ నుంచి అహ్మదాబాద్కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరుతుండగా ఎవరో చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్ల వర్షం మొదలైంది. ఎవరో దుండగులు ఓ బోగీపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. దాంతో ఆ బోగీలోని 59 మంది సజీవదహనమయ్యారు. ఈ రైలు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో ఉంది. గోద్రా ఘటన అనంతరం అల్లర్లు గుజరాత్ అంతటా వ్యాపించాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు. గోద్రా ఘటన జరిగిన మరుసటి రోజు అహ్మదాబాద్లోని గుల్బర్గ్ హౌసింగ్ సొసైటీ వద్ద జరిగిన అల్లర్లలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. ఈ అల్లర్ల కారణంగా రాష్ట్రంలో పరిస్థితి దిగజారడంతో.. మూడో రోజు సైన్యాన్ని దింపాల్సి వచ్చింది.
దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత గోద్రా కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించారు. 2011లో సిట్ కోర్టు 11 మంది దోషులకు మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది. తర్వాత 2017 అక్టోబర్లో గుజరాత్ హైకోర్టు 11 మంది దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అల్లర్ల అనంతరం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మోదీని గుజరాత్ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. దాంతో 2002 మార్చిలో గోద్రా ఘటనపై దర్యాప్తునకు నానావతి-షా కమిషన్ను ఏర్పాటు చేశారు. సబర్మతీ ఎక్స్ప్రెస్ ఘటన ప్రమాదంగా జరిగింది కాదని నానావతి కమీషన్ స్పష్టం చేసింది. దాదాపు 1500 మంది సాక్షులను కమిషన్ విచారించింది. మోదీకి వ్యతిరేకంగా ఏ విధమైన ఆధారాలు లేవని కమీషన్ తన నివేదికలో తెలిపింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..