పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (Manohar parrikar) కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమిపాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్.. పనాజీ (Panaji) అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో తాను బాగానే పోరాడానని, ఫలితం మాత్రం నిరాశ కలిగించిందని చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చానని ఉత్పల్ చెప్పారు. అయితే ఫలితం నిరాశ కలిగించిందని, తనకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి స్థానం నుంచి బరిలో నిలిచినప్పటికీ ఆయన ఓటమి చవిచూడటం గమనార్హం. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి గతనెల 14న ఎన్నికలు జరిగాయి.