న్యూఢిల్లీ: మన దేశంలో బాలుర కన్నా బాలికలకు రాజకీయాలపై ఆసక్తి తక్కువగా ఉందని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆధునిక భావాలున్న కుటుంబాల్లోనూ ఆడ పిల్లలు ఇంటి పనులు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారని సర్వే తెలిపింది. 14-22 సంవత్సరాల మధ్య వయస్కులను ఇన్స్టాగ్రామ్ యాడ్ ద్వారా ప్రశ్నించినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రాజకీయాలతో తమకు సంబంధం ఉందని 51 శాతం మంది బాలురు, 29శాతం మంది బాలికలు చెప్పారని అధ్యయనం తెలిపింది.