కోల్కతా: స్మార్ ఫోన్ కొనడం కోసం తన రక్తాన్ని అమ్మేందుకు ఒక బాలిక ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్లోని దినజ్పూర్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దా ప్రాంతంలో నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. స్మార్ట్ ఫోన్ కొనాలని భావించిన ఆమె రూ.9,000 విలువైన మొబైల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అయితే ఆ మొబైల్ అందేలోపు అంత డబ్బు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా భావించింది. దీంతో తన రక్తాన్ని అమ్మి డబ్బులు సమకూర్చుకునేందుకు ఆ బాలిక ప్రయత్నించింది. బాలూర్ఘట్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ బ్లండ్ బ్యాంకులో విధులు నిర్వహించే ఉద్యోగిని కలిసింది. డబ్బులు ఇస్తే రక్తం ఇస్తానని చెప్పింది.
కాగా, రక్తం అమ్ముతానన్న బాలిక తీరుపై ఆ బ్లండ్ బ్యాంక్ ఉద్యోగి అనుమానం వ్యక్తం చేశాడు. ఆసుపత్రి అధికారులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు వెంటనే చైల్డ్ కేర్ సంస్థకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన చైల్డ్ కేర్ సంస్థ సిబ్బంది, రక్తం ఎందుకు అమ్మాలనుకుంటోందో అని ఆ బాలికను అడిగారు. స్మార్ట్ఫోన్ కొనుగోలు కోసమని ఆమె చెప్పడం విని షాకయ్యారు.