చండీగఢ్: బాలికను కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. (Girl Kidnapped, Raped ) బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హర్యానాలోని జింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 రోజుల కిందట 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంట్లో నిర్బంధించిన ఆమెపై 20 రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, కుమార్తె అదృశ్యంపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుల చెర నుంచి ఆ బాలికను రక్షించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాధిత బాలిక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటు ఉత్తరప్రదేశ్కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.