న్యూఢిల్లీ: కదులుతున్న రైలు నుంచి ఒక బాలిక దూకింది. రైలు పట్టాల పక్కన బోర్లా పడటంతో గాయపడింది. ఆ రైలులోని ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వేగంగా వెళ్తున్న ఒక రైలు డోర్ వద్ద ఒక అమ్మాయి కూర్చొంది. ఒక స్టేషన్ సమీపించడంతో ఆ రైలు వేగం తగ్గుతుంది. దీంతో కదులుతున్న ఆ రైలు నుంచి ఆ యువతి దూకింది. అదుపుతప్పి పట్టాల పక్కగా బోర్లా పడింది. ఆమె ముఖానికి గాయాలైనట్లు తెలుస్తున్నది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
కాగా, ఆ రైలులోని ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ను ఒక యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇడియట్ దీనిని రికార్డ్ చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపాడని, రైలు నుంచి ఆమె దూకడాన్ని ఆపలేదని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆ అమ్మాయి నిర్లక్ష్యపు ప్రవర్తనపై కొందరు మండిపడ్డారు. అలాగే వీడియో తీసిన వ్యక్తి ఆమెను నిలువరించలేకపోవడాన్ని మరి కొందరు విమర్శించారు.
మరోవైపు ఆ వ్యక్తి యువతి చేతులు పట్టుకుని ఆపి ఉంటే, ఆమె అరిస్తే రైలులోని ప్రయాణికులు తప్పుగా అర్ధం చేసుకుని అతడ్ని కొట్టేవారని కొందరు అభిప్రాయపడ్డారు. రైలు వేగంగా కదులుతున్నదంటూ ఆ అమ్మాయిని అతడు హెచ్చరించాడని, ఇందులో ఆ వ్యక్తి తప్పేమి లేదని మరికొందరు సమర్థించారు.
the idiot is more keen on shooting it …
not stopping her! 😩 pic.twitter.com/IYtHHcNoiN— JΛYΣƧΉ (@baldwhiner) February 8, 2024