హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ అంటే రాఖీ కట్టడమే కాదు, పర్యావరణ పరంగా భవిష్యత్ తరాలకు బాటలు వేయవచ్చని స్ఫూర్తినిచ్చే సందేశమిచ్చారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. రక్షాబంధన్ను పురస్కరించుకొని ఒడిశాలోని పూరీ బీచ్లో ఇసుకతో ‘గిఫ్ట్ ఏ ప్లాంట్’ పేరుతో సాండ్ ఆర్ట్ గీశారు. ఒకరికొకరు మొక్కను బహుమతిగా ఇచ్చుకొని పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాకులు, ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు. ‘మొక్కను బహుమతిగా ఇవ్వాలన్న మీ ఆలోచన చాలమంచి నిర్ణయం, అసాధారణం’ అని ట్విట్టర్లో ప్రశంసించారు. ఈ రక్షాబంధన్ ప్రకృతికి మరింత పచ్చదనాన్ని ఇస్తుందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలుకు అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు.