శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. బుధవారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుంచి పీడీపీ అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ, ఇండియా కూటమి అభ్యర్థిగా మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీ చేస్తున్నారు.