న్యూఢిల్లీ, జూన్ 30: భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉద్యోగ విరమణ చేయడంతో, వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఉన్న ధీరజ్ సేథ్ అధిపతి అయ్యారు. 1986లో ఆర్మర్డ్ కార్ప్స్తో కమిషన్డ్ అధికారిగా ధీరజ్ సైన్యంలో ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఎంతో కీలకమైన సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్ రెండింటికీ ఆర్మీ కమాండర్గా వ్యవహరించారు. కశ్మీర్లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. కార్యాచరణ, వ్యూహాత్మక సామర్థ్యం, సంస్థాగత డొమైన్లలో ఆయన సేవలందించారు.