న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కీమోథెరపీ, రేడియేషన్కు లొంగని మెదడు క్యాన్సర్ కణాలను చంపే కొత్త చికిత్సను పరిశోధకులు ఆవిష్కరించారు. మెదడు క్యాన్సర్కు కారణమయ్యే గ్లియోమాస్ కణితులను నాశనం చేసే జన్యు చికిత్సా విధానాన్ని అమెరికాకు చెందిన మిషిగాన్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ చికిత్సావిధానంలో వారు ‘ఎఫ్ఎల్టీ3ఎల్’ అనే ప్రొటీన్ను ఉపయోగించారు. ఇది గ్లియోమాస్ కణితులను సమర్థంగా నాశనం చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల మెదడు క్యాన్సర్ రోగులు బతికే అవకాశం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.