దీపక్ సింగ్… గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి.. అమరుడయ్యాడు. ఆయన అమరుడైనా… ఆయన భార్య ఆ ఆశయ సాధన కోసం సైన్యంలోకి అడుగు పెట్టింది. దీపక్ సింగ్ అనుకున్న కలలను నెరవేర్చి చూపించింది. అయితే.. ఆ కలను చూడడానికి దీపక్ సింగ్ లేరు. ఇదే తనను ఇబ్బంది పెట్టే అంశమని దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ వాపోయారు.
మధ్యప్రదేశ్లో రీవ్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి దీపక్ సింగ్. గాల్వాన్లో చైనా సైనికులతో పోరాడుతూ వీర మరణం పొందారు. అయితే.. దీపక్ సింగ్, రేఖా సింగ్ను ఎలాగైనా సైన్యంలో ఓ అధికారిణిని చేయాలని దీపక్ సింగ్ కలలు కనేవారు. అయితే.. రేఖా సింగ్ మాత్రం.. విద్యా రంగంలో పనిచేస్తూ.. సమాజ సేవ చేయాలన్న తాపత్రయంతో ఉండేవారు.
అయితే.. తన భర్త వీర మరణం పొందిన తర్వాత… ఆమె ఎలాగైనా తన భర్త ఆశయాన్ని నెరవేర్చాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆర్మీ అధికారులను కూడా సంప్రదించి, తగు మార్గనిర్దేశనం పొందారు. సైనిక అధికారుల మార్గనిర్దేశనంతో ఆమె నోయిడా వెళ్లి, సైనిక ప్రవేశ పరీక్ష రాశారు. మొదటి సారి తప్పారు. రెండో సారి కూడా ఈ పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఆమె లెఫ్టినెంట్ హోదాను దక్కించుకున్నారు.
మే 28 నుంచి ఆర్మీ శిక్షణ ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ చైన్నైలో వుంటుందని రేఖా సింగ్ తెలిపారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ పూర్తై న తర్వాత ఆమె సైన్యంలో చేరి, దేశానికి సేవలందించనున్నారు.