న్యూఢిల్లీ, జనవరి 24: భూగ్రహం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లయిన కార్బన్ ఉద్గారాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలకు ఇద్దరు భారతీయ పరిశోధకులు ఏకకాలంలో పరిష్కారం చూపారు. కార్బన్ డయాక్సైడ్, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి పారిశ్రామిక ఇంధనాలను తయారుచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎర్విన్ రైస్నర్ మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేస్తున్న భారత్కు చెందిన మొతియర్ రెహ్మాన్, శుభజిత్ భట్టాచార్జీ కలిసిఓ ప్రత్యేక రియాక్టర్ను అభివృద్ధి చేశారు. ఇది కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్హౌజ్ వాయువులను, ప్లాస్టిక్ వ్యర్థాలను సిన్గ్యాస్, ఫోమిక్ యాసిడ్, ైగ్లెకోలిక్ యాసిడ్ తదితర పదార్థాలుగా మారుస్తుంది. వీటిని పరిశ్రమల్లో విరివిగా వాడుతారు. సిన్గ్యాస్ను ద్రవ ఇంధనంగా ఉపయోగిస్తారు. ఫోమిక్ యాసిడ్ను తోలు, వస్త్ర పరిశ్రమల్లో ప్రాసెసింగ్ కోసం వాడుతారు. ైగ్లెకోలిక్ యాసిడ్ను ఫార్మా పరిశ్రమల్లో వినియోగిస్తారు. తమ పరిశోధన భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యరాలు, కాలుష్య ఉద్గారాల సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపుతుందని రెహ్మాన్, భట్టాచార్జీ ఆశాభావం వ్యక్తంచేశారు.