Rajasthan : రాజస్థాన్లో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను అధికారులు కూల్చేశారు. రాజస్థాన్లోని, శ్రీగంగానగర్కు చెందిన పదమూడేళ్ల బాలిక జూన్ 18న కిడ్నాప్నకు గురైంది. బాలికను స్తానిక రిక్షా కార్మికుడు ఎత్తుకెళ్లి ఒక హోటల్ నిర్వాహకుడికి ఇచ్చేశాడు.
ఆ హోటల్ ఓనర్ బాలికపై హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇతర హోటళ్లకు కూడా బాలికను తీసుకెళ్లాడు. అలా, నాలుగు హోటళ్లలో చిన్నారిపై అత్యాచారం, లైంగికదాడి జరిగింది. దాదాపు ఐదు రోజులపాటు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివిధ హోటళ్లలో మొత్తం 30 మంది వరకు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో బాలిక నొప్పితో ఇబ్బంది పడుతూ, ఏడుస్తుంటే తనకు ఆల్కహాల్ తాగించి, మరీ లైంగిక దాడి చేశారు. ఈ దాడిలో నాలుగు లేదా అంతకుమించి హోటల్స్ ఓనర్స్ ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ఈ లైంగికదాడిని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
నలుగురు ప్రధాన నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను బుధవారం బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తు్న్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హరిశంకర్ తెలిపారు. ఈ అత్యాచారంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు.