న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న నిర్మాణంలో ఉన్న గోదాముకు చెందిన గోడ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ప్రస్తుతం నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, గోడకింద పలువురు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఇదే ఘటనలో పది మంది గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సంఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లను తరలించినట్లు పేర్కొన్నారు.