గురుగ్రామ్/లక్నో, అక్టోబర్ 2: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్యం విషమించింది. దీంతో ఆదివారం ఆయనను గురుగ్రామ్లోని మేదాంత దవాఖానలో చేర్చారు. ప్రస్తుతం ములాయంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆ దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు కుటుంబసభ్యులు గురుగ్రామ్కు చేరుకొంటున్నారు. ములాయం సోదరుడు శివ్పాల్సింగ్ యాదవ్ ఢిల్లీలోనే ఉన్నారని, అఖిలేశ్ యాదవ్ లక్నో నుంచి ఢిల్లీకి బయల్దేరారని ఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజేంద్ర చౌదరి తెలిపారు. ఆగస్టు 22 నుంచి మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్న ములాయం సింగ్ యాదవ్.. అంతకుముందు జూలైలో కూడా అదే హాస్పిటల్లో చికిత్స పొందారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై పలువురు రాజకీయ నాయకులు ఆరా తీస్తున్నారు.