న్యూఢిల్లీ : అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఈ క్రమంలో ఆయనను ఆదివారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ నెల 13న ఆయన అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, అలసట కారణంగా ఎయిమ్స్లో చేరారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఎయిమ్స్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జ్ చేశారు.