దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష అనంతరం మాజీ ఎంపీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్ నేత అజయ్ చౌతాలా గురువారం తిహార్ జైలు నుంచి నుంచి విడుదలయ్యారు. హర్యానా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దుష్యంత్ చౌతాలా ఈయన కుమారుడే. అజయ్ చౌతాలా జైలు నుంచి బయటికి రావడంతో ఆయన మద్దతుదారులు ఆయనకు బోకేలు అందజేసి స్వాగతం పలికారు. ప్రస్తుతం అజయ్ చౌతాలా కుమారుడు దుష్యంత్ చౌతాలా హర్యానా ఉప ముఖ్యమంత్రితో పాటు పార్టీ బాధ్యతలు కూడా చూస్తున్నారు.
హర్యానాలో టీచర్ల రిక్రూట్మెంట్లో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అజయ్ చౌతాలా, ఆయన తండ్రి, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు జైలు శిక్ష పడింది. 2000 సంవత్సరంలో హర్యానాలో టీచర్ల రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయి. 3,206 మంది టీచర్ల రిక్రూట్మెంట్లో అవినీతి జరిగిందని చౌతాలాతో పాటు మరో 55 మందిపై కేసులు నమోదయ్యాయి.