బెంగళూరు, అక్టోబర్ 7: హిందీ వివాదం మరోసారి రాజుకున్నది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలను ఇంగ్లిషు, హిందీలో మాత్రమే నిర్వహించడంపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను అణచివేయాలని చూస్తున్నదని ఆరోపించారు.
కన్నడతో పాటు ఏ ప్రాంతీయ భాషలోనూ ఎస్సెస్సీ పరీక్షలను నిర్వహించడం లేదని.. హిందీ బలవంతానికి, భాష వివక్షకు ఇంతకంటే ఆధారాలు ఉంటాయా? అని కేంద్రం తీరుపై మండిపడ్డారు. దక్షిణాది భాషల పట్ల నిలువెల్లా ద్వేషం నింపుకున్నట్టు కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. తమిళనాడుకు చెందిన డీఎంకే నేత కనిమొళి కూడా ఎస్సెస్సీ పరీక్షల అంశాన్ని లేవనెత్తారు.