రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సోమవారం శాసనసభలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు పీఎంఎల్ఎ కోర్టు నుంచి అనుమతి లభించింది.
చంపయీ సోరేన్ బల పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని హేమంత్ కోర్టుకు చేసిన విజ్ఞప్తిపై ఈడీ అభ్యంతరం తెలిపిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీనినిబట్టి ఈ తతంగమంతా దర్యాప్తు కోసం కాదని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును దెబ్బతీయడం, ప్రభుత్వాన్ని కూల్చడమే ఈడీ ఉద్దేశమని తాము చెప్పామన్నారు.