శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా లోక్సభ ఎన్నికల్లో పో టీ చేయనున్నారు. బారాముల్లా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఉత్తర కశ్మీర్పై బీజేపీ ఎక్కువగా దృష్టి సారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయ న వెల్లడించారు. బారాముల్లా పార్లమెం ట్ నియోజకవర్గం పరిధిలో 18 అసెం బ్లీ సెగ్మెంట్లున్నాయి. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనున్నది. బీజేపీ కు ట్రలు, ద్రోహం, రాజకీయ కుతంత్రాల కు వ్యతిరేకంగా తాను బరిలోకి దిగుతున్నానని వివరించారు. ఎన్సీకి ఒమర్ అబ్దుల్లా ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 2009 తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒమర్ పోటీ చేస్తున్నారు.