వడోదర: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లు, అన్నదమ్ములు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ ఇవాళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నదమ్ములిద్దరూ కుటుంబసభ్యులతో కలిసి వడోదరలోని ఓ పోలింగ్ బూత్కు వచ్చి ఓట్లు వేశారు.
ఈ సందర్భంగా పఠాన్ సోదరులు గుజరాతీ ఓటర్లంతా ఇండ్ల నుంచి బయటికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరి హక్కు, బాధ్యత అని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. మధ్యాహ్నం 3 గంటలు అవుతున్నా 60 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదని తెలిసిందని, కాబట్టి ఓటర్లంతా బయటికి వచ్చి పోల్ పర్సెంట్ పెంచాలని విజ్ఞప్తి చేశాడు.