న్యూఢిల్లీ, మే 27: అక్రమాస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓపీ చౌతాలాకు నాలుగేండ్లు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. దీంతోపాటు చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది.
1999 జూలై నుంచి 2005 మార్చి వరకు చౌతాలా హర్యానా సీఎంగా వ్యవహరించారు. ఆ సమయంలో చౌతాలా, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ సీబీఐ కేసు నమోదుచేసింది.