ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సోదరి అంజూ సెహ్వాగ్ ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కీలక నేతల సమక్షంలో ఆమె ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. ఆప్ నేతలు ఆమెకు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇవాళ పంజాబ్లోని పటియాలాలో పర్యటిస్తున్నారు. దాంతో అంజూ సెహ్వాగ్ ఆయన సమక్షంలో పార్టీలో చేరడం కుదరలేదు. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇవాళ కేజ్రివాల్ పటియాలాలో శాంతి ర్యాలీ నిర్వహించారు.