న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవోగా ఇల్కర్ ఐచీని నియమించారు. ఇల్కర్ గతంలో టర్కి ఎయిర్లైన్స్కు మాజీ చైర్మెన్గా పనిచేశారు. ఎయిర్ ఇండియా బోర్డు మీటింగ్ ఇవాళ జరిగింది. టాటా సన్స్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే బోర్డు సభ్యుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఇల్కర్ నియామకాన్ని ద్రువీకరించారు. ఇల్కర్ ఐచీ వయసు 51 ఏళ్లు. బిల్కెంట్ యూనివర్సిటీలో ఆయన పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. 1995లో బ్రిటన్లోని లీడ్స్ వర్సిటీలోనూ రాజనీతి శాస్త్రంపై పరిశోధన చేశారు. ఇస్తాంబుల్లోని మర్మరా వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేశారు. టర్కిష్ ఫుట్బాల్ ఫెడరేషన్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.