న్యూఢిల్లీ, ఆగస్టు 25: అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇండియా)గా మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ నియమితులయ్యా రు. ఈ విషయాన్ని సిబ్బంది నియామకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజనెస్(ఐఎస్బీ) ప్రొఫెసర్(ఫైనాన్స్)గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి నియామకానికి క్యాబినెట్ ది అపాయింట్మెంట్స్ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 1, 2022 నుంచి మూడేండ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తు తం ఐఎంఎఫ్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుర్జిత్ ఎస్ భల్లా అక్టోబర్ 31న పదవీ విరమణ చేయబోతున్నారు.