బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన ఎస్ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్కు దావణగెరెలోని ఆనెకొండలో ఫామ్హౌస్ ఉన్నది. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ జంతువులను అక్రమంగా ఉంచినట్లు గుర్తించారు. దీంతో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కొన్ని వన్యప్రాణులను పెంచుకోవడానికి మాత్రమే అనుమతి తీసుకున్నారని, అయితే దానికి విరుద్ధంగా మరికొన్ని జంతువులను చట్టవిరుద్ధంగా పెంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, కేసు నమోదుచేశామని వెల్లడించారు.