ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దేవ్లాలీ ఏరియాలో గత రెండు వారాలుగా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను ట్రాప్ చేసి బోనులో బంధించారు. దాంతో దేవ్లాలీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
దేవ్లాలీ ఏరియాలో చిరుతపులి సంచరిస్తున్నదని 10 రోజుల క్రితం తమకు ఫిర్యాదు అందిందని, దాంతో చిరుతను ట్రాప్ చేసి బంధించేందుకు బోను ఏర్పాటు చేశామని, శనివారం చిరుత తమ ట్రాప్లో పడిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఏరియాలో మరికొన్ని చిరుతలు కూడా ఉండే అవకాశం ఉన్నది, కాబట్టి మరో 8, 10 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Maharashtra|10 days ago, we received a complaint that in Nashik’s Devlali area, a leopard was spotted. Yesterday we laid trap & captured leopard. Have alerted the people nearby to be cautious for next 8-10 days because there could be more leopards in the area: Vivek Bhadane, RFO pic.twitter.com/8cVH09BkUA
— ANI (@ANI) December 11, 2022