Rameshwaram Cafe Blast : పేలుడు జరిగిన బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్ను కర్నాటక డీజీపీ డాక్టర్ అలోక్ మోహన్ శుక్రవారం సందర్శించారు. ఈ ఘటనలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఘటనా స్ధలంలో బెంగళూర్ పోలీస్ కమిషనర్ బి. దయానంద ఇతర పోలీస్ అధికారులతో డీజీపీ మాట్లాడారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించింది. బెంగళూర్లోని వైట్ఫీల్డ్లో పేరొందిన రామేశ్వరం కేఫ్ అవుట్లెట్లో పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సమాధానం చెప్పాలని బెంగళూర్ ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనపై రామేశ్వరం కేఫ్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు వివరిస్తూ తాను కేఫ్ బయట నిల్చుని ఉండగా పలువురు కస్టమర్లు హోటల్లోకి వచ్చారని, హఠాత్తుగా లోపల నుంచి భారీ శబ్ధం వినిపిస్తూ మంటలు వ్యాపించాయని చెప్పారు. దీంతో హోటల్లోని పలువురు కస్టమర్లకు గాయాలయ్యాయని తెలిపారు.
బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్లో పేలుడుపై బీజేపీ నేత పీసీ మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని కోరారు. ఓ కస్టమర్ హోటల్లో బ్యాగ్ను వదిలివెళ్లిన తర్వాత పేలుడు జరిగిందని కేఫ్ వ్యవస్ధాపకులు తనకు సమాచారం అందించారని బెంగళూర్ దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సమాధానం చెప్పాలని బెంగళూర్ ప్రజలు కోరుతున్నారని అన్నారు.
Read More :
Suryapeta | ఎస్సారెస్పీ నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతన్నలు