చెన్నై: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మందికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. సీడీఎస్ రావత్ దంపతుల భౌతికకాయాలను ఢిల్లీకి తరలించడానికి ముందుగా.. మిలటరీ హాస్పిటల్ నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో వారి పార్థివదేహాలను ఉంచారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్తోపాటు ఏర్ చీఫ్ మార్షల్ వీర్ చౌధరీ మృత వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
గురువారం మధ్యాహ్నం ఏర్ఫోర్స్ ప్రత్యేక విమానంలో రావత్ దంపతుల భౌతికకాయాలను ఢిల్లీలోని వారి నివాసానికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం వారి భౌతికకాయాలను రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచుతారు. కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించున్నారు.