ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్ష రైల్వే జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం ఫుట్ఓవర్ బ్రిడ్జి స్లాబులు కూలిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 48 ఏండ్ల మహిళ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించింది.
ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఫుట్ఓవర్ బ్రిడ్జి స్లాబులు కూలిపోయాయి. ఆ సమయంలో బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న పలువురికి గాయాలయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మహిళ మృతిచెందింది.