Balharshah Railway Station : మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్లార్ష రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిన సంఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీళ్లలో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రయాణికులు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి నాలుగో నంబర్ ప్లాట్ఫామ్కు వెళ్తుండగా ఒక్కసారిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దాపు 60 అడుగుల ఎత్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలడంతో చాలామంది కింద ఉన్న రైల్వే ట్రాక్ మీద పడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. వీళ్లలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో, రైల్వే అధికారులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వాళ్లకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
‘ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వాళ్లకు రూ.1 లక్ష, స్వల్ప గాయాలు అయినవాళ్లకు రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించాం. గాయపడ్డ వాళ్లు తొందరగా కోలుకోవడం కోసం వాళ్లకు మెరుగైన చికిత్స అందిస్తాం’ అని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.