న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఆహార వృథాను అడ్డుకోవటమే ఆహార భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆహార భద్రతకు ఇదే మొదటి ప్రాధాన్యం కావాలని చెప్పారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో శనివారం వాషింగ్టన్లోని నిర్వహించిన వార్షిక సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆహార భద్రతకు పంట నష్టాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ దేశాలను ఐఎంఎఫ్ వనరులను పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.