న్యూఢిల్లీ, జూలై 29: ఆహార పదార్థాల డెలివరీ సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు పర్మినెంట్గా ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, కరోనా సమయంలో ఇంటినుంచే పని సౌకర్యం కల్పించడం వల్ల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
అంతేగాక పని విధానంలో ఉద్యోగులకు ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వాలనుకున్నామని తెలిపింది. టెక్నికల్ బృందాలు, బిజినెస్ వ్యవహరాలను చూసే కీలక వ్యక్తులు మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా ఉండి పనిచేసేలా చూసుకోవాలని సూచించింది.