న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి 46వ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీ శుక్రవారం ఈ సమావేశం జరుగుతున్నది. ఈ సందర్భంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. విలోమ పన్ను విధానం కూడా చర్చకు రానుంది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున పన్నురేట్లు అమల్లో ఉన్నాయి. అయితే 12, 18 శాతం పన్ను శ్లాబులను కలపాలనే డిమాండ్లు ఉన్నాయి. వీటిపైనా జీఎస్టీ మండలి చర్చించనున్నది.