జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ గ్రూపు మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వైమానిక సంస్థ ఎయిరిండియా వారం పాటు విమాన సర్వీసులను రద్దు చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్యా టెల్ అవీవ్కు రాకపోకలు సాగించే ఎయిరిండియా విమానాలను ఈ నెల 14 వరకు నిలిపివేస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. టికెట్ బుక్ చేసుకొన్న ప్రయాణికులకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నది.