వాహన సంస్థలకు త్వరలో ఆదేశాలు: కేంద్రం
పుణె: వాహనాల్లో విధిగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టాలని మూడు, నాలుగు నెలల్లో కార్ల తయారీదారులకు ఆదేశాలు జారీచేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో కలిసి శుక్రవారం పుణెలో ఓ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేసిన అనంతరం గడ్కరీ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వినియోగం నుంచి దేశానికి విముక్తి కల్పించి స్థానికంగా తయారయ్యే ఇథనాల్ వినియోగం వైపు మళ్లించాలన్నది తన జీవితకాల ఆకాంక్ష అని చెప్పారు. వాహనాల్లో ఫ్లెక్స్ ఇంజిన్లను ప్రవేశపెట్టాల్సిందిగా ఇప్పటికే బజాజ్, టీవీఎస్ కంపెనీలకు సూచించానని, రానున్న మూడు, నాలుగు నెలల్లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, టాటా, మహీంద్రా లాంటి కంపెనీలకు కూడా చెబుతానని తెలిపారు. మిథనాల్ లేదా ఇథనాల్ను గ్యాసోలిన్తో కలిసి తయారుచేసే ప్రత్యామ్నాయ ఇంధనాన్నే ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అంటారు.