ధర్మశాల: భారీ వర్షాలు హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలను కుదిపేస్తున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ప్రవాహవేగానికి రెండు, మూడు భవనాలు కూడా కొట్టుకుపోయినట్టు వీడియోల్లో తెలుస్తున్నది. సోమవారం కూడా భారీ వర్షాలు కొనసాగుతుండటంతో బయటి నుం చి వచ్చే విమానాలను రద్దు చేస్తున్న ట్టు ధర్మశాల విమానాశ్రయ అధికారు లు తెలిపారు. వరదధాటికి మండి-పఠాన్కోట్ను కలిపే హై-వే వంతెన కొట్టుకుపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.