కోల్కతా: పశ్చిమబెంగాల్లో (West Bengal) దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. జల్పాయ్గురి సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒకసారిగా వరద పోటెత్తింది. మెరుపు వరదల్లో పలువురు భక్తులు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశామని, 50 మందిని రక్షించామని జిల్లా మేజిస్ట్రేట్ మౌమిత గోదరా తెలిపారు. వారిలో గాయపడిన 13 మందిని దవాఖానలో చేర్చామని వెల్లడించారు.
మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నామని చెప్పారు. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, స్థానిక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టాయని తెలిపారు. భారీవర్షాల వల్ల మాల్ నదిలో మెరుపు వరదలు వచ్చి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని తెలిపారు.
#UPDATE | West Bengal: Total death count due to flash flood in Jalpaiguri stands at eight. Search is underway to find if there are more casualties: Jalpaiguri DM Moumita Godara https://t.co/LP4AT1UezL
— ANI (@ANI) October 6, 2022