వివాహ వేడుకలో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో గురువారం రాత్రి జరిగింది.
మొరాదాబాద్ జిల్లాలోని మూడంతస్తుల భవనంలో పెళ్లి వేడుక నిర్వహిస్తున్నారు. అందరూ ఆనందంగా వివాహ వేడుకల్లో మునిగితేలుతున్నారు. అయితే, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొంతమంది మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఇందులో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారు. ఘటనాస్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని స్థానికులు కాపాడారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం.