Lashkar terrorists arrested | జమ్మూ కశ్మీర్లో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. బుద్గామ్లో ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు తెలుస్తున్నది. అమర్నాథ్ యాత్రను ఆటంకం కలిగించాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల ఆచూకీ మేరకు పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి వారిని అరెస్టు చేశాయి. అరెస్టయిన వారిని రౌఫ్ అహ్మద్, హిలాల్ మాలిక్, తౌఫిక్ దార్, డానిష్ అహ్మద్, షౌకత్ అలీగా గుర్తించారు.