గువాహటి, అక్టోబర్ 21: సైన్యానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అరుణాచల్ప్రదేశ్లో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కూడా ఐదుగురితో బయలుదేరిన ఈ హెలికాప్టర్ అప్పర్ సియాంగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కూలిపోయింది.
దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదు. దీంతో మూడు హెలికాప్టర్లతో గాలింపు చేపట్టిన సైనికులు ఎట్టకేలకు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీశారు.