జైపూర్: రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలుమలుపును గమనించుకోక మితిమీరిన వేగంతో వెళ్లిన డ్రైవర్లు.. సడన్గా కార్లను మల్లించలేక రోడ్డు దిగి చెట్లను ఢీకొట్టారు. హర్యానాకు చెందిన 10 మంది రెండు కార్లలో రాజస్థాన్లోని గోగమేధి ఆలయానికి వెళ్తుండగా భిరానీ పోలీస్స్టేషన్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.