చెన్నై: బాణాసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా పది మంది గాయపడ్డారు. తమిళనాడులోని మధురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉసిలంబట్టి సమీపంలోని ప్రైవేట్ ఫైర్క్రాకర్స్ ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. అందులో పని చేస్తున్న ఐదుగురు చనిపోయారు. మృతులు అమ్మవాసి, వల్లరసు, గోపి, వికీ, ప్రేమగా గుర్తించారు. మరో పది మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు మధురై ఎస్పీ ధ్రువీకరించారు. ఈ ప్రైవేట్ ఫైర్క్రాకర్స్ ఫ్యాక్టరీ వలైయప్పన్కు చెందినది అని వెల్లడించారు.