గుర్గావ్: హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ పట్టణంలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి సంబంధించిన ప్రహరి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిన గోడ శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు శిథిలాల కింద ఉన్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
సాధ్యమైనంత త్వరగా శిథిలాలను తొలగించి బాధితులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లు ప్రాణాలతో ఉన్నారా..? లేదా..? అనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. ఆలయ గోడ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.
#WATCH | Five workers are feared trapped after the wall of a temple collapsed in Gurugram, Haryana. Rescue operation is underway.
More details are awaited. pic.twitter.com/1kLoZrTN8f
— ANI (@ANI) December 25, 2023