శ్రీనగర్: కశ్మీర్ యూనివర్సిటీకి మొదటిసారిగా ఓ మహిళా ప్రొఫెసర్ వైస్ చాన్సలర్గా నియమితులయ్యారు. వర్సిటీలోని హోం సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ నిలోఫర్ ఖాన్ను (Professor Nilofer Khan) వీసీగా నియమిస్తూ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు జారీచేశారు. 30 ఏండ్ల టీచింగ్ అనుభవం ఉన్న నీలోఫర్.. వీసీగా పదవీకాలం ముగిసిన తలాత్ అహ్మద్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో వర్సిటీ చరిత్రలో వైస్ చాన్సలర్గా నియమితులైన మొదటి మహిళగా రికార్డుల్లో కెక్కారు. కాగా, ఇప్పటికే ఆమె స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా పనిచేసిన తొలి మహిళా ప్రొఫెసర్గా నిలిచారు.
జమ్ము కశ్మీర్ యూనివర్సిటీని 1948లో ఏర్పాటు చేశారు. అనంతరం 1969లో దానిని శ్రీనగర్ కేంద్రంగా కశ్మీర్ యూనివర్సిటీ, జమ్ము కేంద్రంగా జమ్ము యూనివర్సిటీగా విభజించారు. కశ్మీర్ వర్సిటీ దాల్ సరస్సు ఒడ్డున 247 ఎకరాల్లో విస్తరించి ఉన్నది.