న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకలను కూడా బీజేపీ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకుంటున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్కు ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ కండువా ధరించి హాజరైన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ర్టాలకూ త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న శకటాల్లో యూపీ శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రథమ బహుమతికి ఎంపికచేసింది. యూపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే కేంద్రం యూపీ శకటాన్ని ఎంపిక చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక, మేఘాలయ రాష్ర్టాలకు చెందిన శకటాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మూడు రక్షణ సర్వీసుల్లో నౌకాదళానికి చెందిన కవాతు బృందం అగ్రస్థానంలో నిలిచింది.