న్యూఢిల్లీ: అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన వెంటనే అక్కడికి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ‘ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్’ ప్రకటించింది. తమ సంస్థ నుంచి ప్రారంభ విమానం ఢిల్లీ నుంచి అయోధ్యకు ఈ నెల 30న ప్రయాణిస్తుందని, ఈ మార్గంలో రోజువారీ సేవలు జనవరి 16 నుంచి మొదలవుతాయని బుధవారం వెల్లడించింది. అయోధ్యలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అయోధ్య రామ మందిరంలో జనవరి 22న తలపెట్టిన విగ్రహ ప్రతిష్ఠాపన కారక్రమం కన్నా ముందే విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.